మసీదు బండ ప్రభుత్వ పాఠశాలకు ఫ్యాన్లు అందజేసిన రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు తమవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. మసీదు బండ కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల తరగతి గదులలో ఫ్యాన్లు, సౌండ్ సిస్టమ్స్ ను ఆర్ కె వై టీం సభ్యుల ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు ఎలాంటి సహాయ సహకారాలు చేసేందుకైనా సిద్ధమన్నారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు సందయ్య మెమోరియల్ ట్రస్టు ద్వారా స్టడీ మెటీరియల్ అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్లేష్, రాధాకృష్ణ యాదవ్, టీం సభ్యులు గుండె గణేష్ ముదిరాజ్ ,జాజి రావు శ్రీనివాస్, బాజీరావు రాము, శివ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here