సీసీ రోడ్డు పనుల‌ను పరిశీలించిన కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట కాలనిలో రూ. 20 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను శుక్రవారం చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. కాలనీ వాసులకు ఇబ్బంది కలగకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని కార్పొరేటర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం చూపుతామని,డివిజన్ పరిధిలో మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసేలా చేస్తామన్నారు. డీఈ స్రవంతి, ఏఈ రమేష్, వర్క్ ఇన్స్పెక్టర్ హరీష్, అక్బర్ ఖాన్, వరలక్ష్మి రెడ్డి, కార్తీక్ గౌడ్, అమిత్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

సీసీ రోడ్డు పనులను పరిశీలిస్తున్న చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here