చందానగర్ మలబార్ లో “ఆర్టిస్ట్రి” బ్రాండెడ్ జ్యువెలరీ షో ప్రారంభం

నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూంలో “ఆర్టిస్ట్రి” బ్రాండెడ్ జ్యువలరీ షో ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనను ప్రముఖ యాంకర్, నటి మధు కృష్ణన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మలబార్ బంగారు ఆభరణాలు, జాతి రత్నాభరణాల ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంటుందని అన్నారు. అద్వితీయమైన కళా నైపుణ్యంతో రూపొందిన ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని, పరిసర ప్రాంతాల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. స్టోర్ హెడ్ దీపక్ కుమార్ మాట్లాడుతూ “మైన్” ధ్రువీకరించిన వజ్రాభరణాలు తమ ప్రత్యేకత అని అదేవిధంగా “ఎరా” అన్ కట్ వజ్రాలు, “ప్రెష్యా” జాతి రత్నాభరణాలను పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచామన్నారు. “ఎత్నిక్” హస్త కళా నైపుణ్యం, అధునాతన “జోల్” డిజైన్లు, భారతీయ ప్రాచీన సాంప్రదాయాన్ని ఉట్టి పడేసే డివైజ్ జ్యువెలరీకి మలబార్ పెట్టింది పేరని గుర్తుచేశారు.

మహిళలతో కలిసి బ్రాండెడ్ ఆభరణాలను ప్రదర్శిస్తున్న మధు కృష్ణన్, మలబార్ స్టోర్ హెడ్ దీపక్ కుమార్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here