శేరిలింగంపల్లి, ఏప్రిల్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండల పరిధిలోని గచ్చిబౌలి చౌరస్తా ఆటో స్టాండ్ వద్ద మేడే గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం శేరిలింగంపల్లి సిఐటియు కార్యదర్శి కొంగరి కృష్ణ, రంగారెడ్డి జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు రుద్ర కుమార్ మాట్లాడుతూ మే 1న 139 వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే పోరాట స్ఫూర్తితో ఆనాడు చికాగో నగరంలో1889 మే1 జరిగిన కార్మిక వర్గ పోరాటంలో 8 గంటల పని దినం ఉండాలని వీరోచిత పోరాటం చేశారని అన్నారు. ఈ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. ఆ ప్రాణ తర్పంలో వచ్చిన జెండానే ఎర్రజెండా కనుక ప్రపంచం మొత్తం మే 1న కార్మికుల పండుగ జరుపుకుంటున్నారని, మన దేశంలో కార్మిక వర్గం కూడా మేడే ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో బాలు, సాంబ, వీరేష్, సంతోష్, ఆటో కార్మికులు పాల్గొన్నారు.