శేరిలింగంపల్లి, ఏప్రిల్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): నేత్రదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని నేత్రదాన సంచాలకర్త అల్లం పాండురంగా రావు అన్నారు. మాజీ భెల్ ఉద్యోగి, రాజేందర్ రెడ్డి నగర్ కాలనీ అధ్యక్షుడు కుంట రఘుపతి రెడ్డి మాతృమూర్తి కుంట రాజమణి దురదృష్టవ శాత్తూ కన్ను మూశారు. ఈ సందర్భంగా ఆమె కోరిక మేరకు ఆమె నేత్రాలను ఇద్దరికి దానం చేశారు. అల్లం పాండురంగా రావు, పులిపాటి సుధాకర్ల సహాయంతో రాజమణి కుటుంబ సభ్యులు ఆమె నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేశారు. ఈ సందర్భంగా అల్లం పాండు రంగారావు మాట్లాడుతూ రాజమణి నేత్రాలను దానం చేయడంతో ఇద్దరికి కంటి చూపు లభించిందని అన్నారు. ప్రతి ఒక్కరు నేత్రదానం చేయాలని కోరారు.