శేరిలింగంపల్లి, జూన్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): సుమన్ జూనియర్ కళాశాల, వి.డి. బజాజ్ మహిళా డిగ్రీ కళాశాల, బన్సీ లాల్ మలానీ నర్సింగ్ కళాశాల ప్రాంగణంలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బిబిఎ) కోర్సును ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా సుధా దేవ్ జీ వర్మ, డాక్టర్ వి. ఎస్. అళగు వర్శిని, మనీషా సాబూ, టెక్ మహీంద్రా చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పల్లవి కటియార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా దక్షత సమితి కమిటీ ప్రెసిడెంట్ డాక్టర్ సరోజ్ బజాజ్ మాట్లాడుతూ మహిళా దక్షత సమితి కమిటీ విద్యా సంస్థలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బిబిఎ) కోర్సును ప్రారంభించడం ఒక చారిత్రాత్మక క్షణం అన్నారు. ఇది తమకు అపారమైన గర్వం, ఆనందం కలిగించే విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ రాకుమారి, సుశీల పాటిల్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.