శేరిలింగంపల్లి, మార్చి 18 (నమస్తే శేరిలింగంపల్లి): కైదమ్మ కుంట చెరువు పునరుద్ధరణతో దశ దిశ మారునని, చెరువును సుజల జలంతో అపురూప దృశ్యకావ్యంగా ఆవిష్కృతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని కైదమ్మ కుంట చెరువు సుందరీకరణలో భాగంగా Nexus select Malls కంపెనీ CSR ఫండ్స్ ద్వారా మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపట్టనున్న చెరువు పునర్జీవనంలో భాగంగా సుందరీకరణ, పునరుద్ధరణ పనులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ కైదమ్మ కుంట చెరువు దశ దిశ మారుతుందని, చెరువు పునరుద్ధరణ ప్రభుత్వం, పరిశ్రమలు, సమాజం మధ్య భాగస్వామ్య ప్రయత్నాలు అర్ధవంతమైన పర్యావరణ పురోగతిని ఎలా నడిపించగలదో చెప్పడానికి ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ఈ ప్రాజెక్ట్ కీలకమైన సహజ వనరులను పునరుజ్జీవింపజేయడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా భవిష్యత్తులో సుస్థిరమైన అభివృద్ధి కోసం ఒక నమూనాను ఏర్పాటు చేస్తుందని అన్నారు. చెరువు చుట్టుపక్కల కాలనీ వాసులు, ప్రజలు చెరువును సంరక్షించడంలో ప్రతి ఒక్కరు బాధ్యత యుతంగా సామాజిక బాధ్యతో సంరక్షించుకోవాలని, చెరువుల పరిరక్షణ లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని PAC చైర్మన్ గాంధీ తెలియజేశారు.