ప్ర‌జ‌ల‌కు ట్రాఫిక్ ర‌హిత ప్ర‌యాణం కోసం కృషి: డీసీ మోహన్ రెడ్డి

శేరిలింగంపల్లి, మార్చి 18 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): చందాన‌గ‌ర్ స‌ర్కిల్ ప‌రిధిలో ప్ర‌జ‌ల‌కు సుఖ‌వంత‌మైన ప్ర‌యాణానికి బాట‌లు వేస్తామ‌ని సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పి. మోహన్ రెడ్డి తెలిపారు. చందానగర్ లోని శ్రీదేవి థియేటర్ నుంచి అమీన్‌పూర్ లింక్ రోడ్ వ‌ర‌కు కొత్త ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం ప్రతిపాదించిన 150 అడుగుల రోడ్డులో రోడ్డుకు ఇరు వైపులా ఉన్న నిర్మాణాల‌ను క్లియ‌ర్ చేశారు. ఈ సంద‌ర్భంగా మోహ‌న్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న ఆక్ర‌మ‌ణ‌ల‌ను కూల్చివేశామ‌ని అన్నారు. ప్ర‌జ‌ల‌కు ట్రాఫిక్ ర‌హిత ప్ర‌యాణం కోసం ఈ రోడ్డు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here