ఎల్ఆర్ఎస్‌ను ర‌ద్దు చేయాలి: బీజేపీ

గచ్చిబౌలి‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న జీవో నం.135తోపాటు ఎల్ఆర్ఎస్‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ గ‌చ్చిబౌలి డివిజ‌న్ ప‌రిధిలోని గౌలిదొడ్డిలో శుక్ర‌వారం బీజేపీ నాయ‌కులు ధ‌ర్నా, సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగావారు మాట్లాడుతూ.. పేద ప్ర‌జ‌ల‌కు ఎల్ఆర్ఎస్ వ‌ల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, క‌నుక ఎల్ఆర్ఎస్ ను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని, దేశ‌లోని ప్ర‌జ‌ల హ‌క్కుల కోసం బీజేపీ ఎల్ల‌ప్పుడూ పోరాటం చేస్తుంద‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు మ‌ట్ట సురేష్‌, ర‌వీంద్ర ప్ర‌సాద్ దూబే, కృష్ణ ముదిరాజ్, కిష‌న్‌, మ‌హేష్‌, వెంక‌టేష్‌, వ‌సంత్‌, అనిల్‌, శ్రీ‌కాంత్‌, వెంక‌ట్‌, విజ‌య్‌, న‌రేష్‌, శ్రీ‌నివాస్‌, తిరుప‌తి తదిత‌రులు పాల్గొన్నారు.

ఎల్ఆర్ఎస్‌ను ర‌ద్దు చేయాల‌ని ధ‌ర్నా నిర్వహిస్తున్న బీజేపీ నాయ‌కులు
ప్ర‌జ‌ల నుంచి సంత‌కాల‌ను సేక‌రిస్తున్న నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here