మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం – కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని హాఫీజ్ పెట్, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని రామకృష్ణ నగర్ కాలనీలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అందజేసిన మట్టి గణేష్ విగ్రహాలను కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్ పంపిణీ చేశారు.
ప్్జలందరూ మట్టి విగ్రహాలను పూజించాలని పిలుపునిచ్చారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను అందరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని ప్రలజకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎనిమిది సంవత్సరాలుగా సాంప్రదాయ మట్టి వినాయక విగ్రహాలను మట్టితో తయారు చేయించి స్వచ్చంధ సంస్థల ద్వారా ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబంది, కాలనీ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్న కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here