మంత్రి మ‌ల్లారెడ్డిపై భూక‌బ్జా ఆరోప‌ణ‌లు.. కేసు న‌మోదు..

కుత్బుల్లాపూర్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మంత్రి మ‌ల్లారెడ్డిపై పోలీసు కేసు న‌మోదైంది. త‌న భూమిలో కొంత భాగాన్ని మంత్రి మ‌ల్లారెడ్డి క‌బ్జా చేశార‌ని చెబుతూ ఓ మ‌హిళ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో వారు ఆయ‌న‌పై కేసు న‌మోదు చేశారు. వివ‌రాల్లోకి వెళితే.. కుత్బుల్లాపూర్ మండ‌ల ప‌రిధిలోని సూరారం గ్రామానికి చెందిన శ్యామ‌ల అనే మ‌హిళ‌కు 2 ఎక‌రాల 13 కుంట‌ల భూమి ఉంది. అందులో 20 కుంట‌ల స్థ‌లాన్ని మంత్రి మ‌ల్లారెడ్డి ఆక్ర‌మించి ఆ స్థ‌లం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించార‌ని ఆ మ‌హిళ త‌న ఫిర్యాదులో పేర్కొంది. మ‌ల్లారెడ్డికి అమ్ముడుపోయిన త‌న లాయ‌ర్ న‌కిలీ డాక్యుమెంట్ల‌ను సృష్టించార‌ని ఆమె తెలిపింది. త‌న‌ను బెదిరిస్తున్నార‌ని, ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ఆమె పోలీసుల‌ను ఫిర్యాదులో కోరింది. కాగా మంత్రి మ‌ల్లారెడ్డితోపాటు మ‌రో న‌లుగురిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here