చెరువుల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం‌ కృషి – రూ. 4.63 కోట్లతో చెరువుల అభివృద్ధికి ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్ శంకుస్థాపన

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చెరువుల పరిరక్షణకు, సుందరీకరణ కోసం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. హాఫీజ్ పెట్, మాదాపూర్ డివిజన్ల పరిధిలోని ఖాయిదమ్మ కుంట, కొత్తకుంట, తమ్మిడికుంట చెరువుల అభివృద్ధి కోసం రూ. 4 కోట్ల 63 లక్షల వ్యయంతో చేపట్టనున్న సుందరీకరణ పనులకు కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్, ఇరిగేషన్ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిపాదిత చెరువుల అభివృద్దిలో భాగంగా చెరువుకట్టల బలోపేతం, తూముల పటిష్టతకు సంబంధించి పనులు, చెరువుల అభివృద్ది, సుందరీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయని అన్నారు. ఇందులో భాగంగా చెరువుల సుందరీకరణ, ఫెన్సింగ్, వాకింగ్ ట్రాక్ట్ కట్ట బలోపేతం, ల్యాండ్ స్వేపింగ్, గ్రీనరీలో మొక్కలు నాటడం, ఇల్లుమినేషన్ తదితర పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఖాయిదమ్మ కుంట అభివృద్ధికి రూ. కోటి 44 లక్షలు, కొత్తకుంట చెరువు అభివృద్ధికి రూ. కోటి 76లక్షలు, మాదాపూర్ డివిజన్ పరిధిలోని తమ్మిడి కుంట కు రూ.కోటి 43 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని చెప్పారు.

మాదాపూర్ డివిజన్ లో చెరువుల అభివృద్ధి కి శంకుస్థాపన చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్

ఈ కార్యక్రమంలో హఫీజ్ పెట్ డివిజన్ నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, టీఆర్ఎస్ డివిజన్ల అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, గౌరవ అధ్యక్షులు వాలా హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, నాయకులు లక్ష్మా రెడ్డి, వార్డు సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్, హాఫీజ్ పెట్ బిసి, ఎస్సీ సెల్ అధ్యక్షులు నరేందర్ గౌడ్, కంది జ్ఞనేశ్వర్, రవి కుమార్, సంగా రెడ్డి, ప్రవీణ్ గౌడ్, సుదర్శన్, చిన్న, శ్రీశైలం, శేఖర్ గౌడ్, ప్రభు గౌడ్, రాజారామ్, శ్రీనివాస్ గౌడ్, బాబు గౌడ్, కృష్ణ యాదవ్, అక్కినేని శేషగిరి రావు, సుధాకర్, యాదగిరి ముదిరాజ్, ఉమామహేశ్వరరావు, రమేష్ గౌడ్, వెంకటసుబ్బయ్య, మల్లేష్ గౌడ్, శంకర్ యాదవ్, రవి, వెంకట్ యాదవ్, దామోదర్ రెడ్డి, శ్రీనివాస్, ఉమేష్, గోపాల్, సీతారాం, యాదగిరి, పాండు ముదిరాజ్, సుదేశ్, హనీఫ్, పద్మా రావు, దాత్రి గౌడ్, నరేష్ ముదిరాజ్, శ్రీకాంత్ ముదిరాజ్, కేశవ్, కౌశిక్, మహేష్, మూర్తి, మహిళలు ఆశ, ప్రమీల, షేబాన, కథున్ బీ, పర్వీన్ బేగం, ఫర్హాన, ఓ.కృష్ణ, కావూరి అనిల్ కుమార్, పితాని శ్రీనివాస్,‌ హున్య నాయక్, శ్యామ్, సహదేవ్, గోపాల్ నాయక్, తైలి కృష్ణ, కృష్ణ నాయక్, నూరుద్దీన్,‌ అలీ,వార్డు సభ్యులు శ్రీనివాస్, రామచందర్, వాసు, రాందాస్, బాలరాజు, మహిందర్, రామాంజనేయులు, తర్య నాయక్, కోటేశ్, లింగ బాబు, రవి, రాజు, కృష్ణ ముదిరాజ్, రంగస్వామి, కేశవులు, శ్రీనివాస్, రాములు, నారాయణ, అలీం, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

హఫీజ్ పేట్ డివిజ‌న్ లోని చెరువుల సుందరీకరణకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here