శేరిలింగంపల్లి, జనవరి 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్కి చందానగర్ డివిజన్ బీజేపీ కార్యదర్శి క్రాంతి కుమార్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్రాంతికుమార్ మాట్లాడుతూ భిక్షపతియాదవ్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇలాంటి పుట్టిన రోజులను ఆయన మరెన్నింటినో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నానని, తన ట్రస్టు ద్వారా ఇంకా ఎంతో మంది పేదలకు సేవలను అందించాలని కోరుకుంటున్నానని అన్నారు.






