విప్రొ స‌ర్కిల్ వ‌ద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం-మైనంపల్లిపై చ‌ర్య‌లు తీసుకోవాలి: రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పై మల్కాజిగిరి టీఆర్ఎస్ శాసన సభ్యులు మైనంపల్లి హనుమంతు రావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ ను శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని విప్రో సర్కిల్ వద్ద సోమవారం బిజెపి నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ హన్మంతరావు నీ స్థాయి మరచి విమర్శించడం అధికారాన్ని దుర్వినియోగ పరుస్తూ రౌడీయిజం చెలాయిస్తూ సామాన్య ప్రజలపై దాడులు, దౌర్జన్యాలు చేయడం సరికాదన్నారు. ప్రశ్నించే గొంతుకలపై కొంతమంది గుండాలు, అనుచరులతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బండి సంజయ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని వెంటనే క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు. అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి కార్పొరేటర్ మీద జరిగిన దాడికి నైతిక బాధ్యత వహిస్తూ డిజిపి వెంటనే ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్, జిల్లా కార్యదర్శి మూల అనిల్ గౌడ్, రాష్ట్ర రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి రవీందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, డివిజన్ ప్రధాన కార్యదర్శి చెట్టి మహేందర్ గౌడ్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ వెంకటేష్, దయాకర్, తిరుపతి , గచ్చిబౌలి డివిజన్ ఐటీ సెల్ కన్వీనర్ రాఘవేంద్ర, శేరిలింగంపల్లి డివిజన్ బిజెపి కంటెస్టెడ్ కార్పొరేటర్ కంచర్ల ఎల్లేష్, సీనియర్ నాయకులు వసంత్ కుమార్ యాదవ్, శ్రీరాములు, ధనరాజ్ సింగ్, సుబ్రమణ్యం, హరీష్ శంకర్ యాదవ్ ,కిషన్ సింగ్, అనిల్ , మన్నే రమేష్ , రంగస్వామి , వేణు , శివ ప్రసాద్ , శ్రీనివాస్ , క్రాంతి, ప్రశాంత్, శ్రీనివాస్, రాజు , సతీష్, మధు, కృష్ణా, ప్రవీణ్ , దినేష్ , విజయ్, గుండప్పా, రాజు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

మైనంపల్లి వ్యాఖ్యలకు నిరసనగా సీఎం కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్దం చేస్తున్న బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here