కరోనా వ్యాక్సినేషన్ ను పరిశీలించిన కసిరెడ్డి‌ భాస్కర రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేసుకుని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర రెడ్డి పేర్కొన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని గౌతమీ నగర్ మున్సిపల్ పార్కులో కరోనా వ్యాక్సినేషన్ తీరును మంగళవారం పరిశీలించారు. రాబోయే రోజుల్లో మూడో ముప్పు పొంచి ఉందని, అందరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని కసిరెడ్డి భాస్కర రెడ్డి సూచించారు.

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలిస్తున్న కసిరెడ్డి భాస్కర రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here