ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి:శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి , షాదీముబారక్ పథకం ద్వారా మంజూరైన 28 మంది లబ్దిదారులకు రూ.28,31,248/- ఆర్థిక సహాయాన్ని చెక్కుల ను ప్రభుత్వ విప్,‌ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం పంపిణీ చేశారు. కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, పూజిత, జగదీశ్వర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ సాయి బాబా తో కలిసి లబ్దిదారులకు చెక్కులను అందజేసిన అనంతరం గాంధీ మాట్లాడారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి చేరుతున్నాయని అన్నారు. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలతో పేద కుటుంబాల ఆడపిల్లలకు ఎంతో బాసటగా నిలిచియాన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి గారు, శేరిలింగంపల్లి డివిజన్ టిఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, పురుషోత్తం యాదవ్, సురేందర్, గణేష్ ముదిరాజ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందజేస్తున్న ప్రభుత్వ ‌విప్‌ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here