శేరిలింగంప‌ల్లిలోని 200 మంది ల‌బ్ధిదారుల‌కు కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా మంజూరైన 200మంది లబ్దిదారులకు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ గురువారం మియాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెక్కుల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు సకాలంలో అందజేయడం జరుగుతుందని అన్నారు. అభివృద్ధి సంక్షేమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, రాగం నాగేందర్ యాదవ్, గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొమిరిశెట్టి సాయి బాబా, అశోక్ గౌడ్, రవీందర్ ముదిరాజ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, లింగంపల్లి డివిజన్ టిఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, నాయకులు శ్రీను పటేల్, మల్లారెడ్డి, చాంద్ పాష, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

    లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులను అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here