శేరిలింగంపల్లి, జూలై 17 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్వో)గా ఎన్.జయరాం శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అలాగే పోలీస్ స్టేషన్ నూతన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా డి.విజయ నాయక్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి స్టేషన్ పోలీసు అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.






