నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పెట్, మాదాపూర్ డివిజన్ల పరిధిలో పెండింగ్ లో ఉన్న సుమారు రూ.2 కోట్ల మంజీర పైప్ లైన్ పనులను మంజూరు చేసి వెంటనే ప్రారంభించేలా చూడాలని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హెచ్ఎండబ్లుఎస్ఎస్ బి ఎండీ దాన కిషోర్ ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో రాష్ట్ర మున్సిపల్ శాఖమంత్రివ కేటీఆర్ దిశనిర్దేశంలో అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో చేపట్టడం జరుగుతుందని అన్నారు. మంజీర పైప్ లైన్ పనులతో ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపేలా యుద్ధ ప్రాతిపదికన పనులు చెప్పటడం జరుగుతుందని వి.జగదీశ్వర్ గౌడ్ చెప్పారు. హఫీజ్ పెట్, మాదాపూర్ డివిజన్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కృషి చేస్తామని అన్నారు.
