మ‌హేష్ కుమార్ గౌడ్‌కు జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ ధ‌న్య‌వాదాలు

శేరిలింగంప‌ల్లి, జూన్ 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): టిపిసిసి ప్రధాన కార్యదర్శి(జనరల్ సెక్రటరీ) గా ఎన్నికైన సంద‌ర్బంగా టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, టిపిసిసి జనరల్ సెక్రటరీ, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబ‌ర్ వి. జగదీశ్వర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సంద‌ర్బంగా జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ మాట్లాడుతూ త‌న‌కు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ, రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేస్తానని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, నాయకులను కలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం పునరంకితమవుతానని, కాంగ్రెస్ పార్టీ తనపై ఉంచిన నమ్మకన్ని తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తానని, ఏఐసీసీ, టీపీసీసీ ఇచ్చిన ఈ అవకాశం త‌న‌లో బాధ్యతను, నిబద్ధతను మరింత పెంచాయని, కాంగ్రెస్ పార్టీ పురోగతి కోసం అలుపులేకుండా పనిచేసేలా త‌న‌లో ఉత్సాహం నింపినందుకు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here