వ‌ర‌ద ముంపు ప్రాంతాల‌ను ప‌రిశీలించిన జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి, జూన్ 12 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని రామకృష్ణ నగర్, మదీనగూడా ప్రభుత్వ పాఠశాల ప్రాంతం, దత్త సాయి కాలనీలో భారీ వర్షానికి నీట మునిగిన‌ ప్రాంతాలను జోనల్ కమిషనర్ హేమంత్ భోర్కడే, డిసి మోహన్ రెడ్డి, జిహెచ్ఎంసీ ఇంజినీరింగ్‌ ఎస్సీ శంకర్ నాయక్, డీఈ శ్రీదేవి, ఏఈ ప్రతాప్, అధికారులతో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. ఆనంతరం చందానగర్ డివిజన్ పరిధిలోని విజేత బిల్డింగ్ సెల్లార్‌లో వర్షపు నీరు నిలిచిపోయిందని స్థానిక డివిజన్ నాయకులు తెలియజేయడంతో ముంపు ప్రాంతం, వరద ప్రభావిత విజేత బిల్డింగ్ సెల్లార్ ను శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు, స్థానిక చందానగర్ నాయకులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా సెల్లార్లలో ఉన్న వర్షపు నీటిని పంపుల ద్వారా తోడి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరగా సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు అలీ, నియోజకవర్గ నాయకులు మిరియాల రాఘవరావు, ఊరిటీ వెంకట్ రావు, కట్ల శేఖర్ రెడ్డి, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సౌందర్య రాజన్, సాయి గౌడ్, నర్సింగ్ రావు, గౌస్, హనీఫ్, నాగ మహేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here