హంగూ ఆర్బాటం లేకుండా నామినేషన్ దాఖలు చేసిన జగదీశ్వర్ గౌడ్

  • జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున మొదటి నామినేషన్

నమస్తే శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. నోటిఫికేషన్ వచ్చిన మొదటి రోజే జగదీశ్వర్ గౌడ్ జాతీయ కాంగ్రేస్ పార్టీ తరపున నామివేషన్ వేయడం విశేషం. శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల 50 నిమిషాలకు శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజశారు. నియోజకవర్గంలోనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్న జగదీశ్వర్ గౌడ్ ఎలాంటి హంగూ, ఆర్బాటం, సందడి లేకుండా సాదాసీదాగా వెళ్లి నామినేషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన వెంట వారి సన్నిహితులు ఎంఎస్ రాజు, సినిల్ విశ్వనాథ్ లు ఉన్నారు.

ఎన్నికల అధికారి శ్రీనివాస్ రెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేస్తున్న వి.జగదీశ్వర్ గౌడ్, ఎంఎస్ రాజు, సునీల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here