దీప్తి హిల్స్ లో కరోనా వ్యాక్సినేషన్ ను పరిశీలించిన కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి:కరోనా వ్యాధిని అరికట్టేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విధిగా మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ సూచించారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని దీప్తి హిల్స్‌లో హెల్త్, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వాక్సినేషన్ కార్యక్రమాన్ని సోమవారం స్థానిక నాయకులతో కలిసి కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న కోవిడ్ వాక్సినేషన్ తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు డాక్టర్ ప్రసాద్, నర్సింగ్ రావు, ఎన్.ఎమ్ విజయలక్ష్మి, శారద తదితరులు పాల్గొన్నారు.

దీప్తి హైట్స్ లో‌ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలిస్తున్న కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here