- శ్రీలక్ష్మీ గణపతి దేవాలయంలో పూజలు
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్లోని శిల్పా ఎన్క్లేవ్లో ఉన్న విశాఖ శ్రీ శారదా పీఠ పరిపాలిత శ్రీలక్ష్మీ గణపతి దేవాలయంలో బుధవారం విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర స్వామి జన్మదినం, నాగుల చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. స్వరూపానందేంద్ర స్వామికి గురుపాద పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రంలో ఆలయ కమిటీ చైర్మన్ రమణ మూర్తి, భక్తులు పాల్గొన్నారు.
