హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగిన విషయం విదితమే. ఈ క్రమంలోనే బుధవారం నుంచి మూడు రోజుల పాటు నామినేషన్ల పర్వం కొనసాగనుంది. దీంతో రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించే పనిలో తలమునకలయ్యాయి. కాగా బీజేపీ బుధవారం జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఎన్నికల ఇన్చార్జిలను నియమించింది. వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
జోహెచ్ఎంసీ ఎన్నికలకు 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు బీజేపీ నియమించిన ఎన్నికల ఇంచార్జిల వివరాలు…
1.ఎల్బీనగర్ – సంకినేని వెంకటేశ్వరరావు
2.మహేశ్వరం – యెన్నం శ్రీనివాస్ రెడ్డి
3.రాజేంద్రనగర్ – వన్నల శ్రీరాములు
4.శేరిలింగంపల్లి -ధర్మపురి అరవింద్
5.ఉప్పల్-ధర్మారావు
6.మాల్కజిగిరి -రఘునందన్ రావు
7.కుత్బుల్లాపూర్ – చాడ సురేష్ రెడ్డి
8.కూకట్ పల్లి – పెద్దిరెడ్డి
9. పటాన్ చేరు – పొంగులేటి సుధాకర్ రెడ్డి
10. అంబర్పేట్ – రేవూరి ప్రకాశ్ రెడ్డి
11.ముషీరాబాద్ – జితేందర్ రెడ్డి
12.సికింద్రాబాద్ – విజయరామరావు
13.కంటోన్మెంట్ – శశిధర్ రెడ్డి
14.సనత్ నగర్ – మోత్కుపల్లి నర్సింహులు
15.జూబ్లీహిల్స్- ఎర్ర చంద్ర శేఖర్
16.ఖైరతాబాద్ – మృత్యుంజయ
17.నాంపల్లి – సాయం బాపురావు
18.చార్మినార్ -కాసిపేట లింగయ్య
19.గోశామహల్ – యెండల లక్ష్మీనారాయణ
20.కార్వాన్ – బొడిగే శోభ
21.మలక్ పేట – విజయపాల్ రెడ్డి
22.యకత్ పుర – రామకృష్ణ రెడ్డి
23.చాంద్రాయణగుట్ట – రవీంద్ర నాయక్
24.బహదూర్ పుర – సుద్దాల దేవయ్య