శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ లో కాయిదమ్మ చెరువుపై ఇరిగేషన్ అధికారులు నిర్మిస్తున్న పైప్లైన్ నిర్మాణ పనులు ఆగిపోయి రెండు నెలలుగా గడుస్తున్న సందర్భంగా ప్రజావాణిలో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించి కాయిదమ్మ చెరువు వద్ద పనులు తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ రమేష్ తో కలిసి పనులను పరిశీలించారు.






