ఫుట్ పాత్‌పై అక్రమదుకాణాలు.. పట్టించుకోని అధికారులు..

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి కాలనీ 100 ఫీట్ల రోడ్డులో వ్యాపారస్తులు రోడ్ల మీద ఫుట్ పాత్‌లపై అక్రమంగా వ్యాపారాలు చేయడం వల్ల కాలనీ వాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డును ఆక్రమించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, ఇతర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వ్యాపారస్తులు రోడ్ల పక్కన ఫుట్ పాత్ కబ్జా చేయడం, ట్రాఫిక్ జాం సృష్టించ‌డం, ధూళి, దుమ్ముతో గాలి కాలుష్యం వంటి సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు, వాహనదారులు అంటున్నారు. ఈ సందర్బంగా కాలనీ వాసులు మాట్లాడుతూ ఫుట్ పాత్ లపై అక్ర‌మంగా కొన‌సాగుతున్న వ్యాపారాలను తొలగించి ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరచాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here