శేరిలింగంపల్లి, మార్చి 24 (నమస్తే శేరిలింగంపల్లి): రంజాన్ మాసం పర్వదినంను పురస్కరించుకుని ముజాఫర్ అహ్మద్ నగర్ కాలనీ మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన దవాత్- ఏ- ఇఫ్తార్ విందు కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ… రంజాన్ మాసం చాలా పవిత్రమైనది అని, రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రంజాన్ పర్వదినం ను పురస్కరించుకుని ముస్లింలకు ఇప్తార్ విందు ఇవ్వడం చాలా అభినదించదగ్గ విషయం అని, రంజాన్ పండుగ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలను అందించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు జంగిర్, ఇబ్రహీం, యధూళ్ల, రహిమత్, అల్లావుద్దీన్, మహబూబ్, ఖాజా, మినాజ్, గౌస్, సర్ధార్, ముఖిం, అబ్దుల్లా, స్థానిక నాయలు విజయ్, సంతోష్, శివ, అవినాష్, భాస్కర్, పాండు, వంశి తదితరులు పాల్గొన్నారు.