టీబీ వ్యాధి ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న అవ‌స‌రం: డాక్టర్ ఉమా దీపిక

శేరిలింగంప‌ల్లి, మార్చి 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వరల్డ్ టీబీ డే సందర్భంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా TB IEC మెటీరియల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో వైద్యాధికారి డాక్టర్ ఉమా దీపిక మాట్లాడుతూ ఎవరికైతే రెండు వారాలకు మించి దగ్గు కానీ జ్వరం కానీ, బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉన్నట్లయితే వారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఉచితంగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీకి సంబంధించిన పరీక్షలు, మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. వరల్డ్ టీబీ డే సందర్భంగా జిల్లాలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన TBHV బి సంతోష్ , ఆశలు ధర్మజా , స్వాతిని జిల్లా ప్రధాన వైద్యాధికారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ ఉమా దీపిక, ట్రీట్మెంట్ సూపర్వైజర్ బీములు, TBHV సంతోష్, స్టాటిస్టిస్కల్ అసిస్టెంట్ సతీష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here