కొండాపూర్ శ్రీ‌రామ్ న‌గ‌ర్ ఎ బ్లాక్‌లో ఇఫ్తార్ విందు

శేరిలింగంపల్లి, మార్చి 28 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకుని కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్ A బ్లాక్ కాలనీ లో సీనియర్ నాయకుడు చాంద్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించిన దవాత్- ఏ – ఇఫ్తార్ విందు కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ రంజాన్ మాసం చాలా పవిత్రమైనది అని, రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దైవ‌ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రంజాన్ పర్వదినం ను పురస్కరించుకుని ముస్లింలకు ఇప్తార్ విందు ఇవ్వడం చాలా అభినదించదగ్గ విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ముస్లింలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here