శేరిలింగంపల్లి, మార్చి 28 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు సునీతా రావు పిలుపుమేరకు రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు జ్యోతి బీమ్ భరత ఆదేశాల మేరకు శేరిఇంగంపల్లి నియోజకవర్గం అధ్యక్షురాలు చంద్రిక ప్రసాద్ ఆధ్వర్యంలో 108 మియాపూర్ డివిజన్ 122 వివేకానంద నగర్ డివిజన్ 123 హైదర్ నగర్ డివిజన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర మహిళ కాంగ్రెస్ సెక్రెటరీ రమాదేవి, ఏ బ్లాక్ ప్రెసిడెంట్ శ్రీదేవి, వైస్ ప్రెసిడెంట్ పి శాంతా, శేరిలింగంపల్లి జనరల్ సెక్రెటరీ భవాని, కృష్ణకుమారి, శేరిలింగంపల్లి సెక్రెటరీ జ్యోతి, మియాపూర్ అధ్యక్షురాలు సుప్రజ, వివేకానంద నగర్ అధ్యక్షురాలు నాగమణి, హైదర్ నగర్ అధ్యక్షురాలు విమలతో కలిసి కమిటీలకు నియామక పత్రాలు సభ్యులకు అందజేశారు.