శేరిలింగంపల్లి, మే 28 (నమస్తే శేరిలింగంపల్లి): కార్పొరేట్ సామాజిక బాధ్యతగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారు ప్రపంప వ్యాప్తంగా ప్రారంభించిన హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రాజెక్టులో భాగంగా పేదలకు భోజనం పంపిణీ కార్యక్రమాన్ని చందానగర్లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూం వద్ద ప్రారంభించారు. హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవలల్లి, జగతి చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు దుర్గా కల్యాణి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై భోజన పంపిణీ వ్యాన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా భారత్, జాంబియా దేశాల్లో రోజుకు 70వేల మంది పేదలకు భోజనాలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని అన్నారు.