హుడా కాలనీలో సీసీ కెమెరాలను ప్రారంభించిన కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, ఎస్ఐ రాములు

నమస్తే‌ శేరిలింగంపల్లి: సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించవచ్చని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ వాసుల స్వంత నిధులు రూ. 2 లక్షల తో ఏర్పాటు చేసుకున్న 12 సీసీ కెమెరాలను చందానగర్ ఎస్ఐ రాములుతో కలిసి‌ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో ప్రతి కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి అన్నారు. ఎస్ ఐ రాములు మాట్లాడుతూ నేరాల నియంత్రణ, ధర్యాప్తులో సీసీ కెమెరాల పాత్ర కీలకంగా మారనుందన్నారు. స్వంత‌ నిధులతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. ప్రతి కాలనీ లో , ప్రతి ఇంటి ముందు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మోసినుద్దిన్, ఎం.ఏ బెగ్, విజయ్ కుమార్, సలీంబెగ్, నవీన్, చరణ్, రవి, కీర్తి, సుజాత, ప్రసాద్, రామారావు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

హుడా‌ కాలనీలో సీసీ కెమెరాలను ప్రారంభిస్తున్న కార్పొరేటర్‌ జగదీశ్వర్‌ గౌడ్, ఎస్ఐ రాములు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here