మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు ప్రాణవాయువును అందిద్దాం: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని హెచ్ ఎంటి స్వర్ణపురి కాలనీలో సోమవారం ఏడో విఢత హరితహారం కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు పచ్చదనాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జి హెచ్ఎంసి ఎస్ ఆర్ పి కనకరాజు, ఎస్ఎఫ్ఏలు, హెచ్ఎంటి కాలనీ అధ్యక్షుడు దేవేందర్, రాములు, కోటేశ్వరరావు, కృష్ణమోహన్, వెంకట్ రెడ్డి, శివరామరాజు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతున్న మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here