తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ మెంబర్ గా హమీద్ పటేల్ ప్రమాణ స్వీకారం

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీలో సభ్యునిగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులంతా కలసి హజ్ కమిటీ చైర్మన్ మొహ్మద్ సలీం ను ఎన్నుకున్నారు. ఈ హజ్ కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకరానికి హోంమంత్రి మహమ్మద్ మహామూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై హజ్ కమిటీ చైర్మన్, కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. హజ్ కమిటీ మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా
కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ ఎంతో బాధ్యతతో కూడిన హజ్ కమిటీకి మెంబర్ గా హజ్ యాత్రికులకు సేవా చేసే అవకాశం లభించిందన్నారు. ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, హోం మంత్రి మహమ్మద్ మహామూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ మొహ్మద్ మసి ఉల్లా ఖాన్, ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.

హజ్ కమిటీ మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here