వ‌సంత సిటీలైఫ్ ఆపార్ట్‌మెంట్స్‌లో ఉత్సాహంగా హ‌రితహారం

నమస్తే శేరిలింగంపల్లి: రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా శనివారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని వసంత సిటీ లైఫ్ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక‌ కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యుల తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి‌ గాంధీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ కాలనీలో రెండు సంవత్సరాల క్రితం నాటిన మొక్కలను సంరక్షించుకోవడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు తప్పనిసరిగా నాటాలని , మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సుబ్బరాజు, లైఫ్ అపార్టుమెంట్ వాసులు చైతన్య, ఉప్పల్, వరుణ్, రవి, రామ్, సందీప్ , సాయి ,మారుతి ప్రసాద్ ,మురళీధర్ రావు, సునీత రెడ్డి, లక్ష్మీ, మోహన, ధరణి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

వసంత సిటీ అపార్ట్ మెంట్ లో మొక్కలు నాటుతున్న ప్రభుత్వ ‌విప్ గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here