శేరిలింగంపల్లి, మే 22 (నమస్తే శేరిలింగంపల్లి): హనుమాన్ జయంతి పర్వదినంను పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ విలేజ్ లో ఉన్న శ్రీ హనుమాన్ దేవాలయంలో జరిగిన హనుమాన్ జయంతి వేడుకలలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని అన్నారు. ఎక్కడ శ్రీరాముడు కొలువై ఉంటాడో ఎక్కడ శ్రీరామ నామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు. ఆయనను మించిన భక్తుడు లేడన్నారు. శ్రీ రామచంద్రుడు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న భాగ్యశాలి హనుమంతుడు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు గంగాధర్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఓం ప్రకాష్ గౌడ్, కృష్ణ పటేల్ గౌడ్, నాగేశ్వర్ గౌడ్, అశోక్, వెంకటేష్ గౌడ్, రవి గౌడ్, కృష్ణ గౌడ్, వీరేందర్, ప్రవీణ్, మహేందర్ ముదిరాజ్, శ్రీనివాస్ ముదిరాజ్, శివ ముదిరాజ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.