విశాఖ శ్రీ శారదా పీఠపాలిత ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవాలు ప్రారంభం

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో శ్రీ హనుమజ్జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 25వ తేదీన హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 23 నుంచి 25వ తేదీ‌ వరకు ఆలయం‌ ఆవరణలో‌ శ్రీ హనుమజ్జయంతి ఉత్సవాలు‌ జరగనున్నాయి. 23 న సంకల్పము, విష్వక్సేనా పూజ, పుణ్య హవచనము, దీక్షారాధన, సర్వ దేవతా ప్రార్థన, ధ్వజారోహణ ప్రధాన హోమాలు నిర్వహించారు.

ధ్వజారోహణ ప్రధాన హోమం నిర్వహిస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here