వెంకటేశ్వరాలయంలో ఘనంగా హనుమత్ హోమం

నమస్తే శేరిలింగంపల్లి: హనుమాన్ జయంతిని పురస్కరించుకొని చందానగర్ లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో గల ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అందులో భాగంగా 24 వ తేదీన ఉదయం 8 గంటలకు సంకల్పం, చతుర్థశ కలశారాధన, కుంభ పూజ, పంచామృతాభిషేకం, ఉదయం 10 గంటలకు తోమాల సేవ, ఉదయం 11.30 గంటలకు హనుమత్ హోమం, హారతి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అష్టోత్తర శత కలశ మండపారాధన, సర్వాభీష్ట సిద్ది కోసం సహస్త్ర కదలీఫల హోమం, హారతి తీర్థ ప్రసాదాల వితరణ కార్యక్రమం చేపట్టారు. పరిసర ప్రాంతాల భక్తులు, ఆలయ కమిటీ నిర్వాహకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

హనుమత్ హోమం నిర్వహిస్తున్న భక్తులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here