హఫీజ్ పేట్ డివిజన్ లో గణానాధులను దర్శించుకున్న బాలింగ్ గౌతమ్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన వివిధ వినాయక మండపాలను డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ బుధవారం సందర్శించారు. గంగారం గ్రామం, అంబేద్కర్ నగర్, ఓల్డ్ హఫిజ్ పెట్, మహంకాళి దేవాలయం, హఫిజ్ పెట్ జెండా గణేష్ మండపాలలోని వినాయకులను గౌతమ్ గౌడ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని భక్తులకు స్వామి వారి అన్న ప్రసాదాన్ని వడిడించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో డివిజన్లోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు భగత్, శ్రవణ్, దినేష్, మనోజ్ యాదవ్, రాజ్ కుమార్, భాను తదితరులు పాల్గొన్నారు.

గణనాథుల పూజల్లో బాలింగ్ గౌతమ్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here