శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ జన్మభూమి కాలనీలో శ్రీ వాల్మీకి బోయ కిషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ వాల్మీకి మహర్షి గొప్ప వ్యక్తి అని అన్నారు. సంస్కృత సాహిత్యంలో పేరెన్నికగల కవి అని, రామాయణాన్ని రాశారని అన్నారు. ఈయన్ని సంస్కృతభాషకు ఆదికవిగా గుర్తిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం కార్పొరేటర్ అడ్డాల స్వామి, వాల్మీకి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రేపల్లె కృష్ణ వాల్మీకి, తెలంగాణ స్టేట్ ప్రధాన కార్యదర్శి జ్యోతి, బోయ నగేష్, బోయ తిమ్మప్ప, నాయకులు ,కార్యకర్తలు, మహిళలు, కాలనీ వాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.