ఆల్విన్ కాలనీ గణనాథుని చెంత అన్నదానం – ప్రారంభించిన జ్ఞానేంద్ర ప్రసాద్

నమస్తే శేరిలింగంపల్లి: ఇంద్రారెడ్డి ఆల్విన్ లో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని డిక్టేటర్స్ యూత్ అసోసియేషన్ అయోధ్య వినాయక మండపం వద్ద బుధవారం బిజెపి రాష్ట్ర నాయకులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అసెంబ్లీ కన్వీనర్ జ్ఞానేంద్ర ప్రసాద్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుండి ప్రజలందరూ రక్షింపబడి, గణనాథుని దీవెనలతో అందరికీ సుఖసంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రాప్తించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు వీరు, భాను, రాకేష్,వర్మ, శ్రీకిరణ్, అజయ్, ధర్మ, కార్తిక్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

విఘ్నేశ్వరునికి పూజలు చేస్తున్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్రప్రసాద్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here