అభివృద్ధియే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం – జీహెచ్ఎంసీ ‌కౌన్సిల్ లో మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలకు మెరుగైన మౌళికవసతులు అందించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు‌ సాగుతోందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శనివారం జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మాదాపూర్ ‌కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడారు. డివిజన్ పరిధిలో ప్రధానంగా చేపటాల్సిన అభివృద్ధి పనులపై, నిధుల విడుదలపై చర్చించారు. అంతకుముందు మొదటగా సమావేశంలో మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, భారతీయ సైనిక అధికారి బిపిన్ రావత్, మాజీ ఎమ్మెల్యే రామస్వామి యాదవ్, లింగోజి గూడ కార్పొరేటర్ ఆకుల రమేష్, మాజీ కార్పొరేటర్ భన్వర్ లాల్, మాజీ కార్పొరేటర్ అపర్ణ, కరోన కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకోసం పనిచేసి మరణించిన జీహెచ్ఎంసీ సిబ్బంది మరణంపై సానుభూతి తెలుపుతూ సంతాపం ప్రకటించాలని తీర్మాణం ప్రవేశపెట్టారు. అనంతరం కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో మంత్రి కేటీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రపంచ సంస్థలను ఆకర్షించేందుకు కృషి చేస్తుందన్నారు. ప్రజలకు మెరుగైన మౌళికవసతులు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు.

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతున్న కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here