చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ డివిజన్ భవానీపురం వీకర్ సెక్షన్ దర్గాలో శుక్రవారం ముస్లింలు నిర్వహించిన గ్యార్మీ పండుగ ఉత్సవాల్లో చందానగర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ, ముస్లింల మధ్య ఐక్యతకు గ్యార్మీ ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. ప్రతి ఏటా ముస్లింలు నిర్వహించే గ్యార్మీ ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అక్బర్, దాస్, హజారాం, అఖిల్, మహబూబ్, ధన్ రాజ్, రాములు, బాబా, సౌకజ్, నాగరాజు పాల్గొన్నారు.
