హిమసాయి లేక్ వ్యూ గేటెడ్ కమ్యూనిటీ హాల్ లో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్లలోని హిమసాయి లేక్ వ్యూ గేటెడ్ కమ్యూనిటీ లో ఏర్పాటు చేసిన వినాయకుని మండపం వద్ద గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పూజలు చేశారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే గణపతి నవరాత్రులను మట్టి విగ్రహాల తోనే పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, పర్యావరణాన్ని సూచించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజా కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, గోపనపల్లి తండా వడ్డెర సంఘం ప్రెసిడెంట్ అలకుంట శ్రీరామ్, హిమసాయి లేక్ వ్యూ ప్రెసిడెంట్ హరీష్, అరవింద్ రెడ్డి, సెక్రటరీ శ్రీనివాస్, రాజన్ బాబు, మెంబర్లు ప్రతాప్, వేంకటేశ్వర రావు, సురేష్ మట్ట, శ్రీనివాస్ చారీ, సీనియర్ నాయకులు శ్రీనివాస్ , రాజు నర్సింగ్ రావు , హిమసాయి లేక్ వ్యూ గేటెడ్ కమ్యూనిటీ వాసులు, భక్తులు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

వినాయకునికి పూజలు చేస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here