ప్రతి ఒక్కరిలో భగవంతుని పట్ల ఆరాధన‌భావం‌ ఉండాలి : మాధవానంద సరస్వతి

నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి ఒక్కరిలో భగవంతుని పట్ల ఆరాధనాభావం కలిగి ఉండాలని, నేటి కంప్యూటర్ యుగంలో ఆధ్యాత్మికత ఎంతో అవసరమని రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ పరమహంస పరివ్రాజక శ్రీ మాధవానంద సరస్వతి స్వామి సూచించారు. రంగంపేటలోని ఆశ్రమంలో పీఠాధిపతి మాధవానంద స్వామి ని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాధవానంద సరస్వతి స్వామి ఆధ్యాత్మిక ప్రవచనాలు బోధించారు. భక్తులకు భగవంతుని పట్ల కలిగి ఉండాల్సిన పద్ధతులను వివరించారు. ప్రతి ఒక్కరూ భగవంతుని పట్ల ఆరాధనా భావం కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శివరామచంద్ర మూర్తి, గుర్రం రవీందర్ రావు, దుర్గం వీరేశం గౌడ్, బొల్లంపల్లి సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్ రాజు ముదిరాజ్, మహేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రవీందర్ రెడ్డి, హరి శంకర్, పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here