శేరిలింగంపల్లి, డిసెంబర్ 31 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు, కార్పొరేటర్లకు ,ప్రజాప్రతినిధులకు ,నాయకులకు ,కార్యకర్తలకు,పాత్రికేయ మిత్రులకు ,అధికారులకు , మిత్రులకు ,శ్రేయాభిలాషులకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేశారు . ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజలందరూ గత సంవత్సరాన్ని స్మరించుకుంటూ నూతన సంవత్సరంలోకి అడిగిడుతూ ఈ నూతన సంవత్సరం ఆశలు, ఆశయాలు, విజయాలు చేకూరి, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరారు.