గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పరామర్శ

నమస్తే శేరిలింగంపల్లి: గుట్టల బేగంపేట్ లో కలుషిత నీటి సరఫరాతో అనారోగ్యానికి గురైన బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ చెప్పారు. గుట్టల బేగంపేట వడ్డెర బస్తీలో కలుషిత నీరు తాగి తీవ్ర అస్వస్థతకు గురై గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు బాధితులను మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన వారిలో ముగ్గురి పరిస్థితి బాగలేకపోవడంతో గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. భాదితులకు అన్ని విధాలా అండగా ఉంటామని అన్నారు. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో చిన్నారులకు, భాదితులకు ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. చికిత్స పొందుతున్న వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కొలుకుంటున్నారన్నారు. ముగ్గురు భాదితులు వృద్దులు కావడంతో ప్రత్యేక చికిత్స కోసం గాంధీ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ రాజారావు పర్యవేక్షణలో చికిత్స అందించడం జరుగుతుందని చెప్పారు.

గాంధీ ఆస్పత్రిలో బాధితులను పరామర్శిస్తున్న మాదాపూర్ ‌కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here