సమస్యలపై మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి‌ శ్రీకాంత్ పాదయాత్ర

నమస్తే శేరిలింగంపల్లి: డివిజన్ పరిధిలో నెలకొన్న అన్ని సమస్యలను దశల వారీగా పరిష్కరించి ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దుతామని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరినగర్, ఎఫ్ సీ ఐ కాలనీలలో స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేశారు. కాలనీల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

మయూరి నగర్ లో సమస్యలపై స్థానికులతో మాట్లాడుతున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

మయూరి నగర్ కాలనీలో మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. రోడ్లు డ్రైనేజీ, మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఎఫ్ సీ ఐ కాలనీలో నెలకొన్న యూజీడీ సమస్యను‌ వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. కాలనీలలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో కృషి చేస్తామని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ చెప్పారు.  కార్యక్రమంలో వాటర్ వర్క్, డీజీఎం నాగప్రియ, మేనేజర్ సాయి చరిత, కాలనీ వాసులు సుప్రజ, ఉమా కిషన్, సలీమ్, హరి కృష్ణ, రమణ, నవీన్ లాల్, నరసింహా మూర్తి, రవి మురళి, అశోక్, గోపాల్ రెడ్డి, ప్రాన్సెస్ రెడ్డి, కిషోర్, అప్పారావు, విజయ్ మోహన్, రాము, రమేష్, విజయ్, జేమ్స్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

ఎఫ్ సీ ఐ కాలనీలో అధికారులతో కలిసి పర్యటిస్తున్న మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here