చందాన‌గ‌ర్‌లో ఘ‌నంగా దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చ‌ందాన‌గ‌ర్‌ళోని గౌత‌మిన‌గ‌ర్‌లో ఉన్న శ్రీశ్రీశ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం అమ్మవారు శ్రీ గాయత్రి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. 250 మంది మహిళలు లలితా సహస్ర నామ సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు. అనంత‌రం 800 మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించి అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు.

గాయ‌త్రి దేవి అవ‌తారంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తున్న అమ్మ‌వారు

ఈ పూజలో చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రగునాథ్ రెడ్డి, బిల్డర్ మిరియాల రాఘవరావు. కట్ల శేఖ‌ర్ రెడ్డి, రాఘవ, శ్రీకాంత్ రెడ్డి, శ్రీను రెడ్డి, నాగ, గుఱ్ఱపు శ్రీకాంత్ పాల్గొన్నారు. గౌతమినగర్ కాలనీ అధ్యక్షుడు ప్రసాదరావు, సెక్రెటరీ శివప్రసాద్, జగదీష్, రాజయ్య, యాదయ్య, శ్రీను, రాజు, విశాల్, దేవాలయ అర్చకులు సాయిశర్మ పాల్గొన్నారు.

అమ్మ‌వారి కుంకుమార్చ‌న పూజ‌లో పాల్గొన్న మ‌హిళ‌లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here